కోనరావుపేట, ఫిబ్రవరి 17: ‘వేములవాడ నియోజకవర్గంతో నాది పేగుబంధం. ఇక్కడి ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉన్నది.’ అని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు వ్యాఖ్యానించారు. పేదల కష్టాలను తీర్చడమే లక్ష్యమని, మల్కపేట రిజర్వాయర్తో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని పేర్కొన్నారు. నాగారం, మల్కపేట గ్రామాల్లో పర్యటించారు. నాగారంలో 20 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. అనంతరం రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పోరాట పటిమతోనే తెలంగాణ సిద్ధించిందన్నారు. ఆయన హాయాంలో ఎనిమిదేండ్ల నుంచి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మల్కపేట రిజర్వాయర్తో కోనరావుపేట మరో కోనసీమలా మారనున్నదని పేర్కొన్నారు. చెన్నమనేని రాజేశ్వర్రావు బాటలో పయనించి ఈ ప్రాంత ప్రజల కలలను సాకారం చేస్తానని ప్రకటించారు.
‘చేతనైన కాడికి మంచి పనులు చేయాలి..అప్పుడే ప్రజల గుండెల్లో నిలుస్తాం. ఫ్లెక్సీలు కడితే వచ్చేదేంలేదు’ అని పేర్కొన్నారు. కొందరు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు వచ్చిపోయేవాళ్లు కాదు..శాశ్వత అభివృద్ధి చేస్తున్నవారే నాయకులుగా మనగలుగుతారన్నారు. గతంలో ఊరూరా వాటర్ ట్యాంకులు, శుద్ధ జల కేంద్రాల ను నిర్మింపజేశానని గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గాన్ని సమగ్రం గా అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. అనంతరం నాగారంలోని కోదండ రామస్వామి ఆలయ పునురుద్ధరణ పనులను పరిశీలించారు. తర్వాత మల్కపేటలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న మల్కపేట రిజర్వాయర్ ప్యాకేజ్-9 పను ల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే రమేశ్బాబు అధికారులను ఆదేశించారు. మల్కపేట రిజర్వాయర్ బండ్-4 కట్ట పనులు, ప్రాజెక్ట్ మ్యాప్ను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు. నాణ్యతతో కూడిన పనులు చేస్తూ మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా రిజర్వాయర్ను ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రిజర్వాయర్ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరందతుందన్నారు.
మల్కపేట రిజర్వాయర్ బండ్-4 కట్టపై సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించగా ఎమ్మెల్యే రమేశ్బాబు, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ హాజరై కేక్ కట్ చేశారు. జల ప్రదాత జన్మదిన వేడుకలను మల్కపేట రిజర్వాయర్పై జరుపుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు. ఇక్కడ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్య, సర్పంచులు బాస లావణ్య, ఆరె లత, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గోపు పరశురాములు, వైస్ఎంపీపీ వంగపల్లి సుమలత, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ గోగు ప్రతాపరెడ్డి, తహసీల్దార్ నరేందర్, ఎం పీడీవో రామకృష్ణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, సీనియర్ నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, ప్రాజెక్టు డీఈలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.