Gudem | ఓదెల, మార్చి 12: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ చిట్ల రమేష్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు గురువారం వరంగల్ జిల్లాలోని ఆదర్శ గ్రామం గంగాదేవిపల్లి సందర్శనకు వెళ్లారు. దేశానికి దిక్సూచిగా అభివృద్ధి చెందిన తీరును పరిశీలించడానికి గంగాదేవిపల్లికి వెళ్లినట్లు సర్పంచ్ తెలిపారు.
అక్కడ గ్రామం ఏ విధంగా అభివృద్ధి, అక్కడ ప్రజల సహకారం ఎలా ఉందనే అంశాలపై తెలుసుకోవడానికి వెళ్లినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. గంగాదేవి పల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని గూడెం గ్రామానికి నిర్మల్ పురస్కారం అవార్డు వచ్చే విధంగా తమ పాలకవర్గం కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుడిగే కుమారస్వామి, వార్డు సభ్యులు తిప్పారపు అభిలాష్, కర్ర శ్రీధర్, బుడిగే లక్ష్మణ్, వీరముష్టి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.