Dr. Chirumilla Rakesh | కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 28 : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన నాంసానిపల్లి మాజీ ఉప సర్పంచ్ వీరవేణి రమేష్ మేనకోడలు వివాహ వేడుకకు టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమల్ల రాకేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట ఓదెల మాజీ వైస్ ఎంపీపీ పోతుగంటి రాజు, కర్రె దేవేందర్ రెడ్డి, అల్లం సదయ్య, పెగడపల్లి వార్డు సభ్యులు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కుకట్ల నవీన్, వీరవేణి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.