వేములవాడ, జనవరి 26: రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగం గా శుక్రవారం వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు వినూత్నం గా అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు పండ్లు అందజేసి అభినందించారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి ప్రమాదాలు జరిగే తీరును వివరించి, గులాబీ పూలు అందజేశారు. రో జురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ తెలిపారు.