Dharmaram | ధర్మారం,జూలై 22: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బోనాల ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు బోనాల ఉత్సవ వేడుకలు నిర్వహించారు. 3,4 తరగతి లో పాఠ్యాంశం లో తెలంగాణ బోనాలు వేడుకల గురించి పాఠం ఉంది.
ఈ క్రమంలో ఆషాఢం లో జరిగే బోనాలు విశిష్టతను బోనం అనే పదం భోజనం అనే పదం నుండి వచ్చింది అమ్మవారికి బెల్లం అన్నం, బోనం నేవైద్యం లో ఉన్న ఆయుర్వేద వేపాకు సైంటిఫిక్ ఈ పండుగలో దాగి ఉన్న విశిష్టతను పాఠశాల హెడ్మాస్టర్ సముద్రాల వంశీ మోహనాచార్యులు వివరించారు. పోతరాజుల వేషధారణలో విద్యార్థులు ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూర రజిత వెంకటేశం, ఉపాధ్యాయులు సంపత్, లక్ష్మణ్, సౌమ్య, ఎస్ఎంసి చైర్ పర్సన్ తాళ్లపల్లి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.