మెట్పల్లి మారుతీనగర్, జనవరి 11: భద్రాచలం రాములోరి కల్యాణానికి ఏటా మెట్పల్లికి చెందిన మహిళలు వడ్లను గోటితో ఒలిచిన బియ్యాన్ని సిద్ధం చేయడం ఆనవాయితీ.
ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గురువారం పట్టణంలోని బాలకృష్ణనగర్లోని మహిళలు వడ్లను చేతితో ఒలుస్తూ కనిపించారు. ఈ నెల 15న తలంబ్రాలను భద్రాచలానికి పంపిస్తామని వారు చెప్పారు.