కమాన్చౌరస్తా, జూన్ 28: కరీంనగర్లో జగన్నాథస్వామి ఆలయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇందుకు 15 రోజుల్లోగా స్థలం కేటాయిస్తామని చెప్పా రు. కరీంనగర్ అభివృద్ధి, ఆధ్యాత్మికతకు నిలయమని వ్యాఖ్యానించారు. బుధవారం కరీంనగర్లో ఇసాన్ మెట్పల్లి, ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఆయన తెలంగాణ చౌక్ వద్ద పాల్గొని మంత్రి గంగుల పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అ నంతరం మంత్రి మాట్లాడారు. ఎకడైతే ఆ ధ్యాత్మికత వెల్లివిరుస్తుందో అకడ ప్రశాంతత చేకూరుతుందని చెప్పారు.
పూరిలో జరిగే జగన్నాథ రథయాత్ర మాదిరిగా కరీంనగర్లో అంగరంగ వైభవంగా రథయాత్ర నిర్వహించ డం గర్వకారణమన్నారు. ఈ రథయాత్రలో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఆయన వెంట మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూ ప, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, డాక్టర్ ఎడవల్లి విజయేందర్రెడ్డి, డాక్టర్ శైలజ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన రథాన్ని లాగుతూ భక్తులను ఉత్సాహపరిచారు. ఇక్కడ స్థానిక నాయకులు ఉన్నారు.