కరీం‘నగరానికి’ తలాపునే ఉన్న దిగువ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో నీరు డెడ్ స్టోరేజీకి చేరువవుతున్నది. మొత్తం 24 టీఎంసీలకు గానూ డెడ్ స్టోరేజీ 2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 5.7 టీఎంసీలు మాత్రమే నీరున్నది. రోజురోజుకూ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుండడం భయపెడుతున్నది.
బుధవారం ప్రాజెక్టు గేట్లు తేలాయి. ఏప్రిల్ రెండో వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు డ్యాం ఎండిపోయే ప్రమాదం కనిపిస్తున్నది. ఇప్పటికే నగరంలో తాగునీటి తిప్పలు మొదలు కాగా, రాబోయే రోజుల్లో ఈ సమస్య తీవ్రమయ్యే ముప్పు ఉన్నదని ప్రజానీకం ఆందోళన చెందుతున్నది.
– కరీంనగర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్