రాంనగర్, డిసెంబర్ 17: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు కరీంనగర్ పోలీసు శిక్షణ కేంద్రంలో శారీరక సామర్ధ్య, దేహదారుఢ్య ఎంపిక పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం 1,207 మంది అభ్యర్థులకు 903 మంది హాజరయ్యారు. ఇందులో 531 మంది అర్హత సాధించగా 372 మంది విఫలమయ్యారు. 133 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అనారోగ్య, ఇతర కారణాలతో 171 మందికి ఇతర తేదీల్లో హాజరుకు అనుమతించారు. తొలుత అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోమెట్రిక్, రిజిస్ట్రేషన్, రిస్ట్ బ్యాండ్ టాగింగ్, ఆర్ఎఫ్ఐడీ బిబ్ జాకెట్లను ధరింపజేశారు.
1600 మీటర్ల పరుగులో అర్హత సాధించిన వారికి లాంగ్ జంప్, షాట్ పుట్ విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 8,900 మందికి గానూ 7,398 మంది హాజరయ్యారు. ఇందులో 4,782 మంది అర్హత సాధించగా 2,538 మంది అనర్హులయ్యారు. 1,942 మంది గైర్హాజరయ్యారు. వైద్య, ఇతర కారణాలు చూపుతూ 841 మంది ధ్రువీకరణ పత్రాలు సమర్పించడంతో వారికి మరో తేదీల్లో హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చారు. ఇందులో పురుష అభ్యర్థులు 4,661 హాజరుకావాల్సి ఉండగా 3,592 మంది హాజరు కాగా 1840 మంది అర్హత సాధించారు. 1,751 మంది అర్హత సాధించలేకపోయారు.
575 మంది గైర్హాజరయ్యారు. వైద్య, ఇతర కారణాలు చూపుతూ 596 మంది ధృవపత్రాలను సమర్పించారు. మహిళా అభ్యర్థులు 4,239 మంది హాజరు కావాల్సి ఉండగా 3,806 మంది హాజరు కాగా 2,942 మంది అభ్యర్థులు అర్హత సాధించగా 787 మంది అర్హత సాధించలేదు. 367 మంది గైర్హాజరయ్యారు. వైద్య, ఇతర కారణాలు చూపు తూ 245 మంది ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. ఇప్పటి వరకు పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువ శాతం మంది అర్హత సాధించినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ ఎస్ శ్రీనివాస్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, విజయ్కుమార్, సీహెచ్ మల్లికార్జున్, ప్రతాప్, వి రామానుజం, మదన్ లాల్, ఎస్బీఐ జీ వెంకటేశ్వర్లు. ఏవో మునిరత్నం, సూపరింటెండెంట్ ఏవీఎన్ చారి, మినిస్టీరియల్ విభా గం సీఐలు మాధవి, బీ సంతోష్కుమార్, రాజ్కుమార్, కరుణాకర్, ఆర్ఎస్ఐలు జానిమియా, కిరణ్ కుమార్, మురళి, రమేశ్, సురేశ్, మల్లేశం పాల్గొన్నారు.