మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
రిటైర్డ్ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి హాజరు
తెలంగాణ చౌక్, డిసెంబర్ 5: విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో ముందుండాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (వోపా) ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన విశ్వబ్రహ్మణ రిటైర్డ్ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు సృష్టికర్తలని చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వా మి వారసులుగా పంచకర్మ సిద్ధాంతాన్ని పా టిస్తూ సమాజంలో ఆదర్శంగా జీవించాలని ఆకాంక్షించారు. నిస్వార్థంగా ప్రజాసేవలో పాలుపంచుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో విశ్వబ్రాహ్మణ వసతి గృహం నిర్మాణ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. విశ్వకర్మ విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సమావేశంలో వోపా గౌరవాధ్యక్షుడు కట్ట విష్ణువర్ధన్, అసోసియేట్ అధ్యక్షుడు వేములవాడ ద్రోణాచారి, నాయకులు రావుల నిరంజనాచారి, సింహరాజు కోదండరాములు, కళికో ట భాస్కరాచారి,తదిరులు పాల్గొన్నారు.