వేములవాడ, నవంబర్ 22: వచ్చే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. సోమవారం సంగీత నిలయంలో నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన అభ్యర్థికి క్రమశిక్షణతో ఓటువేసి గెలిపించుకుందామన్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోకబాపురెడ్డి, జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్రావు, మండల పరిషత్తు అధ్యక్షులు బూర వజ్రమ్మ, బైరగోని లావణ్య, గంగం స్వరూప, జవ్వాజి రేవతి, చంద్రయ్యగౌడ్, జడ్పీటీసీలు మ్యాకల తిరుపతి, యేస వాణి, గట్ల మీనయ్య, నాగం భూమయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, పొన్నాల శ్రీనివాసరావు, కౌన్సిలర్లు మారం కుమార్, నరాల శేఖర్, ఇప్పపూల అజయ్, సిరిగిరి రామ్చందర్, యాచమనేని శ్రీనివాసరావు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.