న్యూఢిల్లీ, మే 3: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.2,589 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించినట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,905 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 36 శాతం అధికం. ఏడాది క్రితం రూ.12,084.71 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.16,175.87 కోట్లకు ఎగబాకింది. సమీక్షకాలంలో బాంక్కు వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 8 శాతం ఎగబాకి రూ.3,843 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఇది రూ.3,560 కోట్లుగా ఉన్నది. గతేడాది మొత్తానికి రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు 90 పైసలు డివిడెండ్ను బోర్డు ప్రతిపాదించింది. అలాగే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.25 శాతం నుంచి 3.22 శాతానికి పెరుగగా, నికర ఎన్పీఏ 0.71 శాతం నుంచి 1.23 శాతానిక ఎగబాకాయి.