బేగంపేట్ : నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఈ నెల 14న సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డులోని వెస్లీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వెస్లీ పీజీ కళాశాల డైరక్టర్ డాక్టర్ విమల్ సుకుమార్ తెలిపారు. గురువారం కళాశాల ప్రాంగణంలో జరిగిన సమావేశంలో జాబ్మేళాకు సంబంధించిన బ్రోచర్ను ఆయన స్పైస్ జాబ్ , వైఎంసీఏ అధ్యక్షుడు డానియల్తో కలిసి ఆవిష్కరించారు.
స్పైస్ జాబ్, వైఎంసీఏ, వెస్లీ కళాశాల, ఎన్జివోలతో కలిసి జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ..వెస్లీ కళాశాలలో 14న 40 కంపెనీలతో కలిసి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ జాబ్ మేళాలో మల్టినేషనల్ కంపెనీలు కూడా పాల్గొంటున్నట్టు తెలిపారు. పదవ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ కోర్సులు చదివిన విద్యార్ధుల వరకు ఈ జాబ్మేళాలో పాల్గొని అర్హతలను బట్టి ఉద్యోగం పొందవచ్చునని చెప్పారు.
కరోనా కారణంగా ఉద్యోగాలు పోయిన వారు, వివిధ కోర్సులు చేసి ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న యువతకు సుమారుగా 5 వందల వరకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ మేళాను ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మద్య ఉన్న యువత ఈ మేళాలో పాల్గొనవచ్చునని చెప్పారు.
ఇతర వివరాలు 8885410555…..8885073555 నెంబర్లలో సంప్రదించాలని నిర్వహాకులు కోరారు. మేళాకు వచ్చే వారు ఉదయం 9.30 గంటలకు వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పైస్ జాబ్ సంస్ధ సీఈవో జాన్ అబ్రహం తదితరులు పాల్గొన్నారు.