కీవ్: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తమ దేశానికి చెందిన మూడు వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 10 వేల మంది సైనికులు గాయపడి ఉంటారని ఆయన చెప్పారు. సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సమాచారాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా న్యూక్లియర్ దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా జెలెన్స్కీ హెచ్చరికలు చేశారు. ఫిబ్రవరి 24వ తేదీన రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే.
మాస్క్వాపై 2 మిస్సైళ్లు..
ఉక్రెయిన్కు చెందిన రెండు మిస్సైళ్లు మాస్క్వా యుద్ధ నౌకను ధ్వంసం చేసినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. ఆ సమయంలో దాంట్లో ఉన్న రష్యా సిబ్బందికి తీవ్ర నష్టమే జరిగినట్లు కూడా అమెరికా తెలిపింది. నల్ల సముద్రంలో ఉన్న మాస్క్వా నౌకపై నెప్ట్యూన్ మిస్సైళ్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. ఆ నౌక కెప్టెన్ ఆంటోన్ కుప్రిన్ పేలుడులో చనిపోయినట్లు ఉక్రెయిన్ మంత్రి తెలిపారు.