Xi Jinping | దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అయోమయానికి గురయ్యారట.. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఓ హాల్ వైపు నడుచుకుంటూ వెళుతున్న జీ జిన్ పింగ్ను అనుసరించేందుకు చైనా డెలిగేట్ ప్రయత్నించారు. కానీ హాలు ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది.. సదరు డెలిగేట్ను అడ్డుకున్నారు. బలవంతంగా అతడ్ని అడ్డుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తున్నది. ఆ వెంటనే ఎంట్రన్స్ మూసేశారు.
దీంతో కాస్త ఇబ్బందిగా ముందుకెళ్లిన జిన్ పింగ్.. కొద్ది సేపు నిలుచుండి పోయారు. ఏ జరుగుతుందో తెలియక అయోమయంతో వెనక్కి తిరిగి చూసినా నడుచుకుంటూ ముందుకెళ్లి పోయారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మధ్య భేటీ ఉంటుందన్న సంగతి తేలకున్నా.. వేదికపైకి వెళుతున్నప్పుడు ఇద్దరి మధ్య చర్చ సాగింది. సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, జిన్ పింగ్ కరచాలనం చేసుకున్నారు.
South African Security Officers physically stop Chinese Officials from entering BRICS main venue behind Xi Jinping. Forcibly shut the door.🤣🤣🤣#Prigojine #Prigozhin #republicanDebate #Wagner #BRICSSummit2023 #XiJinping #BRICS #BRICSSummit2023 #BRICSSummit #ChinaNews #China pic.twitter.com/dY4CgLZadq
— Mr. R V (@Havoc3010) August 24, 2023