రష్యాపై దాదాపుగా అన్ని దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్పై దాడికి దిగితే మాత్రం అత్యంత ముఖ్యమైన నార్డ్ స్ట్రీమ్-2 పైప్లైన్ను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ను హెచ్చరించారు. ఇక ఇప్పుడు ఈ కోవలోకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా వచ్చి చేరారు. ఉక్రెయిన్పై రష్యా దాడులకు దిగితే మాత్రం రష్యా కంపెనీలపై తీవ్రమైన ఆంక్షలను విధిస్తామని, అవసరమైతే మూసేస్తామని కూడా బ్రిటన్ ప్రధాని బోరిస్ అల్టిమేటం జారీ చేశారు.
ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగితే మాత్రం.. తాము కూడా అంతే తొందరగా స్పందిస్తామని, రష్యా కంపెనీలపై కఠినతరమైన ఆంక్షలను విధిస్తామని ఆయన ప్రకటించారు. వ్యక్తులపై, సంస్థలపై ఆంక్షలు విధించడానికి తాము పార్లమెంట్ నుంచి ప్రత్యేక అనుమతులు కూడా పొందుతామని బ్రిటన్ ప్రధాని వెల్లడించారు. ‘ఉక్రెయిన్పై దాడి చేస్తే.. రష్యా కంపెనీలు, బ్యాంకులపై విరుచుకుపడతాం. వాటినే టార్గెట్ చేస్తాం. కఠినమైన ఆంక్షలు విధిస్తాం. అందులో అనుమానాల్లేవ్. కఠినాతికఠినమైన ఆంక్షలుంటాయి. రష్యా కంపెనీలే ఎక్కడా లేకుండా చేస్తాం’ అంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్రంగా హెచ్చరించారు.