చైనాకు డబ్ల్యూహెచ్వో.. కొవిడ్పై దర్యాప్తు

బీజింగ్: ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ బృందం వచ్చే నెలలో చైనాలో పర్యటించనుంది. కరోనా వైరస్పై దర్యాప్తు జరపడానికి ఈ బృందం వెళ్తున్నట్లు డబ్ల్యూహెచ్వో బుధవారం వెల్లడించింది. కరోనా వైరస్ మూలాలు ఎక్కడ ఉన్నాయో తేలాల్సిందేనని అంతర్జాతీయ సమాజం చాలా రోజులుగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ మొదట కనిపించిన వుహాన్పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి నుంచి చైనాలోని మిగిలిన ప్రాంతాలకు, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. అయితే ఈ వైరస్ తమ దగ్గర పుట్టింది కాదని చైనా వాదిస్తోంది. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఇతర దేశాల నుంచి చైనాకు వచ్చిన ఆహార పదార్థాల ద్వారానే తమ దేశానికి వైరస్ వచ్చినట్లు కూడా ప్రచారం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన దర్యాప్తులో ఏం తేలుస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
- కేంబ్రిడ్జ్ ఎనలిటికాపై సీబీఐ కేసు
- టీకా అంటూ ఫోన్లు వస్తే నమ్మొద్దు
- మెట్రోనగరి.. మేలైన స్థిరాస్తి!
- సర్కార్ను విమర్శిస్తే నేరమే!
- పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపించాలి
- సేవలు అభినందనీయం
- వ్యవసాయ పనుల్లో బాలకార్మికులు
- టీకాలపై రాజకీయాలొద్దు: మోదీ
- ఆలయ ప్రహరీ మరమ్మతు ప్రారంభం
- రిలయన్స్ గర్జన