America : అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. అట్లాంటాలోని ఒక అపార్ట్మెంట్ లోపల కాల్పులు జరిగాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు టీనేజర్స్ మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. సోషల్మీడియాలో మొదలైన వివాదం ఇద్దరు టీనేజర్స్ మరణానికి కారణమైంది. కాల్పుల సంఘటనలో 14, 16 ఏళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలు చనిపోయారు. ఇద్దరు అబ్బాయిలు, 15 ఏళ్ల బాలిక గాయపడింది అని డిప్యూటీ చీఫ్ చార్లెస్ హంప్టన్ జూనియర్ తెలిపాడు.
‘సోషల్ మీడియా వివాదమే కాల్పులకు కారణం. తుపాకులు చేతబూనిన కొందరు యువకులు శనివారం సాయంత్రం 5 గంటలకు అట్లాంటాలోని అపార్ట్మెంట్కు వచ్చారు. వాళ్లను చూసిన మరో గ్రూప్ కాల్పులు మొదలు పెట్టింది. ఇరువర్గాలు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. సిటీలోని చాలామంది యువలకు చేతిలో గన్స్ ఉన్నాయి’ అని హంప్టన్ వెల్లడించాడు. అయితే.. గన్ఫైర్ వెనక మరేదైనా కారణం ఉందేమోననే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.