టెహ్రాన్, సెప్టెంబర్ 1: ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులు ప్రారంభించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ లక్ష్యంగా అమెరికా దళాలు మంగళవారం భీకర దాడులకు దిగాయి. హొర్ముజ్లోని వాణిజ్య నౌకలపై, ఆ ప్రాంతంలో మోహరించి ఉన్న అమెరికా సైనిక సిబ్బంది లక్ష్యంగా ఐఆర్జీసీ దాడులు చేసేందుకు ప్రయత్నించినందున తాము మళ్లీ దాడులకు దిగినట్టు అమెరికా ప్రకటించింది. అయితే అమెరికా దళాలు ఇరాన్లోని ఏ ప్రాంతంపై దాడి చేసింది, ప్రాణ, ఆస్తి నష్టం వివరాలను వెల్లడించ లేదు.
కాగా, ఇప్పటికే ఆదివారం అమెరికా దళాలు హొర్ముజ్లో ఉన్న ఇరాన్ రాకెట్ లాంచర్లపై దాడి చేశాయి. దీనికి ప్రతీకారంగా జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. సముద్రపు మైన్లను జలసంధిలోకి ప్రయోగించే రాకెట్లను సిద్ధం చేయడంలో ఐఆర్జీసీ దళాలు నిమగ్నమై ఉన్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. కాగా, తమపై దాడులు జరిగిన విషయాన్ని అంగీకరించిన ఇరాన్.. అమెరికా వైఖరిపై తీవ్రంగా మండిపడింది. త్వరలోనే వాషింగ్టన్ సైనిక, ఆర్థిక పరిణామాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.