ఐక్యరాజ్యసమితి, సెప్టెంబర్ 24: కరోనా మహమ్మారి కథ ముగిసినట్టేనని ఐక్యరాజ్యసమితి తెలిపింది. నాలుగు రోజులపాటు జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల సందర్భంగా కరోనా అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ మాట్లాడుతూ..ఇకపై కేసుల్లో పెరుగుదల అంతగా ఉండదని, అలాగని జీరో రేటు కూడా నమోదు కాదని తెలిపారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకున్నారని, కరోనా మహమ్మారిని ఇక అంతం చేద్దాం అని పిలుపునిచ్చారు.