పీఎంఎల్ఎన్ ఎంపీ మరియం ఔరంగజేబ్ మాజీ ప్రధాని ఇమ్రాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని హొదాలో ఇమ్రాన్ తప్పులు చేశారని, వాటి ఫలితమే పాక్ ప్రజలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఇమ్రాన్ వల్లే నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని, నిరుద్యోగం పెరిగిపోయిందని ఆమె విరుచుకుపడ్డారు.
ఇస్లామాబాద్లో జరిగిన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇమ్రాన్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రధాని హోదాలో ఇమ్రాన్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని, ప్రతిపక్ష నేతలను కేసుల్లో ఇరికించడానికి అధికారాన్ని వాడుకున్నారని మండిపడ్డారు.
ఇమ్రాన్ కేవలం పీఎంఎల్ఎన్ పార్టీని తిట్టడానికే తన అధికారాన్నంతా వాడుకున్నారని ఆమె ఫైర్ అయ్యారు. నేతలను ఎన్నుకున్న హక్కు ప్రజలకు ఉందని, ఆ ప్రజలే ఇమ్రాన్ను కూడా గద్దె దించారని మరియం ఔరంగజేబ్ పేర్కొన్నారు.