కీవ్: దక్షిణ ఉక్రెయిన్లో ఉన్న పిడనౌక్రాన్స్క్ అణు విద్యుత్తు కేంద్రం వద్ద సోమవారం రష్యా మిస్సైల్ దాడి చేసింది. అయితే ఆ ప్లాంట్లో ఉన్న మూడు రియాక్టర్లకు ఎటువంటి ప్రమాదం లేదు. కానీ పరిశ్రమ సామాగ్రి ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఇదేమీ అణు ఉగ్రవాదం కాదని అధికారులు స్పష్టం చేశారు. ఉక్రెయిన్ మౌళికసదుపాయాలపై దాడుల్ని పెంచనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. రష్యా దళాలకు తీవ్ర నష్టం వాటిల్లిన తర్వాత పుతిన్ ఆ కామెంట్ చేశారు. పిడనౌక్రాన్స్క్ ప్లాంట్కు 300 మీటర్ల దూరంలో మిస్సైల్ దాడి జరిగింది. ఈ ప్లాంట్నే సౌత్ ఉక్రెయిన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని పిలుస్తారు.