లండన్, జూన్ 6: పార్టీగేట్ కుంభకోణం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి ఎసరు తెచ్చింది. స్వపక్షం కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల నుంచే ఆయన అవిశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు 1922 కమిటీ (కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్) ఛైర్మన్ సర్ గ్రాహమ్ బ్రాడీ చట్టసభ్యులకు వెల్లడించారు. పార్టీకి చెందిన 54 మంది ఎంపీలు అవిశ్వాస పరీక్షకు సముఖంగా ఉన్నట్టు వివరించారు. సోమవారం కడపటి వార్తలు అందే సమయానికి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కొనసాగుతున్నది. కరోనా సంక్షోభంలో నిబంధనలు ఉల్లంఘించి పార్టీలు చేసుకొన్నారంటూ బోరిస్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్ని పార్టీగేట్ కుంభకోణంగా పిలుస్తున్నారు.