ఉక్రెయిన్పై రష్యా చొరబాటు ప్రారంభమైందని బ్రిటన్ ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ సంచలన ప్రకటన చేశారు. రష్యాపై ఆంక్షలు విధించడానికి కూడా తమ ప్రభుత్వం సన్నద్ధమైపోయిందని ప్రకటించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధ్యక్షతన ఓ అత్యవసర సమావేశం జరిగింది.
‘ఉక్రెయిన్పై రష్యా చొరబాటు ప్రారంభమైందని మనం ఓ నిర్థారణకు రావొచ్చు. సందేహం లేదు. ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై దాడి చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయానికి వచ్చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే మేం ఆంక్షలు విధిస్తాం’ అని బ్రిటన్ మంత్రి సాజిద్ జావిద్ ప్రకటించారు. పార్లమెంట్ వేదికగా ప్రధాని బోరిస్ జాన్సన్ ఆంక్షల విషయాన్ని ప్రకటిస్తారని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన వారిపై ఆంక్షలకు తాము రెడీగానే ఉన్నామని సాజిద్ జావిద్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్లోని డెనెట్స్క్, లూహాన్స్క్లను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తున్నామని, మిటరీ సహాయం కూడా అందిస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు వేర్పాటువాద నాయకులతో ఫైల్పై పుతిన్ సంతకం కూడా చేశారు.