నాటింగ్హామ్: ఇంగ్లండ్లోని నాటింగ్హామ్( Nottingham)లో దారుణం జరిగింది. 19 ఏళ్లకు చెందిన ఇద్దరు టీనేజర్లను ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఆ ఉన్మాది మరో 50 ఏళ్ల వ్యక్తిని కూడా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఓ వ్యాన్ను దొంగలించి దాంతో ముగ్గుర్ని గాయపరిచాడు. కత్తి దాడిలో మృతిచెందిన వారిని బార్నబి వెబర్, గ్రేస్ కుమార్గా గుర్తించారు. ఈ ఇద్దరూ యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్లో చదువుతున్నారు. పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. తెల్లవారుజామున ఇకెస్టాన్ రోడ్డుపై ఆ ఇద్దరు టీనేజర్లు నిర్జీవంగా పడిఉన్నారు.
టీనేజర్లు శవమై తేలిన ప్రాంతానికి మరో రెండు మైళ్ల దూరంలో ఓ వ్యాన్ డ్రైవర్ కూడా చనిపోయి ఉన్నాడు. అయితే మర్డర్కు పాల్పడిన అనుమానితుడే వాన్ను దొంగలించి ఆ డ్రైవర్ను కూడా చంపి ఉంటాడని డిటెక్టివ్లు భావిస్తున్నారు. తెల్లవారుజామున 5.30 నిమిషాలకు నాటింగ్హామ్లోని రాయల్ థియేటర్ బస్సు స్టాప్ వద్ద ఉన్న ప్రయాణికులపై ఆ ఉన్మాది తన వద్ద ఉన్న వ్యాన్తో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.