కొలంబియా: స్పానిష్ యుద్ధంలో ముగిగిన రెండు నౌకలను కొలంబియా అధికారులు గుర్తించారు. 1708లో బ్రిటీష్ దాడిలో సాన్ జోస్ యుద్ధ నౌక మునిగిపోయింది. అయితే ఆ నాటి తెరచాప నౌక శిథిలాలను గుర్తించారు. ఆ నౌకల్లో తరలించిన సుమారు 1.32 లక్షల కోట్ల (17 బిలియన్ల డాలర్ల) విలువైన బంగారాన్ని కూడా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.
స్పానిష్ సక్సెసన్ యుద్ధంలో బ్రిటీష్ నౌకలు జరిపిన దాడిలో సాన్ జోస్ నౌక నీటి మునిగింది. ఆ నౌకలో సుమారు 600 మంది ఉన్నారు. వారితో పాటు బంగారు నాణాలు, ఆభరణాలు, ఇంకా బంగారు సామాగ్రి ఉన్నాయి. అయితే అప్పటి నౌకా దళానికి చెందిన రెండు ఓడల శిథిలాలను ఇప్పుడు గుర్తించారు.
ఆధునిక టెక్నాలజీతో తయారైన రిమోట్ వెహికిల్తో సముద్ర గర్బంలోకి వెళ్లి ఆ శిథిలాలను పసికట్టారు. సుమారు 3100 ఫీట్ల లోతుకు ఆ రిమోట్ వెహికిల్ వెళ్లి ఓడల శిథిలాలను గుర్తించినట్లు కొలంబియా అధికారులు వెల్లడించారు. నీట మునిగిన ఫిరంగులు కూడా ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.