ఒట్టావా, అక్టోబర్ 7: కెనడాలో ఒక శిక్షణ విమానం నేలకూలిన ప్రమాదంలో భారత్కు చెందిన ఇద్దరు ట్రైనీ పైలట్లు సహా ముగ్గురు మృతి చెందారు. బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్లో శనివారం విమానం కూలిన ప్రమాదంలో ముంబైకి చెందిన శిక్షణ పైలట్లు అభయ్ గద్రూ, యాష్ విజయ్ రాముగడే మరణించారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు.
రెండు ఇంజిన్ల తేలికపాటి విమానం పైపర్ పీఏ-34 సెనెకా హఠాత్తుగా చిల్లీవాక్ సిటీకి దగ్గరలో ఉన్న ఒక మోటెల్ వెనుక చెట్లు, పొదల మధ్య కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో మరో పైలట్ కూడా మరణించినట్టు పోలీసులు చెప్పారు. ప్రమాదంపై కెనడాకు చెందిన ట్రాన్స్పోర్యేషన్ సేఫ్టీ బోర్డు విచారణ జరుపుతున్నది.