వర్జీనియా: అమెరికాలోని వర్జీనియాలో కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. బ్రిడ్జ్వాటర్ కాలేజీలో ఓ ఆగంతకుడు ఇద్దర్ని కాల్చి చంపాడు. ఆ కాలేజీలో సెక్యూర్టీ ఆఫీసర్లుగా చేస్తున్న ఇద్దరు పోలీసుల్ని హతమార్చాడు. మరణించిన వారిని పోలీస్ ఆఫీసర్ జాన్ పెయింటర్, క్యాంపస్ సేఫ్టీ ఆఫీసర్ జేజే జెఫర్సన్గా గుర్తించారు. కాల్పులు జరిపిన నిందితుడిని 27 ఏళ్ల అలెగ్జాండర్ వాయత్ క్యాంప్బెల్గా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. రాకింగ్హామ్ కౌంటీ జైలులో అతన్ని బంధించారు. ఆ ఆర్ట్స్ కాలేజీలో సుమారు 1800 విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఓ అనుమానాస్పద వ్యక్తి క్యాంపస్లో తిరుగుతున్నట్లు తొలుత పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు అక్కడికి వెళ్లడంతో ఆ అనుమానితుడు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో కాలేజీ సెక్యూర్టీ పోలీసులు మృతిచెందారు.