Tunisia : ట్యూనీషియాలో సార్వత్రిక ఎన్నికలు శనివారం జరగనున్నాయి. అయితే ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ ఎన్నికలను బాయ్కాట్ చేయాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. అధ్యక్షుడు కైస్ సాయిద్ తన అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని ఎన్నహ్ద, ది హార్ట్ ఆఫ్ ట్యూనీషియా ప్రతిపక్షాలు ఆరోపించాయి. అంతేకాదు ఈ ఎన్నికలను కుట్రలో భాగం అంటూ విమర్శించాయి. అరబ్ విప్లవం కారణంగా ట్యూనీషియా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
మాజీ లా ప్రొఫెసర్ అయిన కైస్ సాయిద్ 2019లో ట్యూనీషియా 8వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మొదట్లో ప్రజలు ఆయన తీసుకొచ్చిన పాలసీలను సమర్ధించారు. కానీ, అవినీతి, ఆర్థిక సంక్షోభం దేశాన్ని పీడిస్తుండడంతో సాయిద్పై వ్యతిరేకత పెరిగింది. అంతేకాదు అధ్యక్షుడి అధికారాలపై ఎలాంటి పరిమితులు ఉండొద్దని ఏకంగా సాయిద్ రాజ్యాంగాన్ని మార్చేశాడు. దాంతో ఆ దేశ ప్రజలు ఎన్నికల్లో ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. దాంతో, ఓటింగ్ శాతం చాలా తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.