FBI Director : సోషల్మీడియా యాప్ టిక్టాక్ ద్వారా చైనా అమెరికాపై నిఘా పెట్టే అవకాశం ఉందని ఎఫ్బీఐ డైరెక్టర్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాదు టిక్టాక్ యాప్ వల్ల అమెరికా దేశ భద్రతకు ముప్పు అని క్రిస్ వ్రే అన్నాడు. ‘టిక్టాక్లోని కంటెంట్ చైనా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈ యాప్ మనదేశ విలువలను పంచుకోదు. అందులోని కంటెంట్ను దుర్వినియోగం చేయడమే కాకుండా యూజర్ల డేటాను సేకరించి, అమెరికాపై గూఢచర్యం చేసే అవకాశం ఉంది’ అని అన్నాడు. అంతేకాదు టిక్టాక్ కంటెంట్ను మార్చగల సామర్థ్యం చైనా ప్రభుత్వానికి ఉందని క్రిస్ వ్రే తెలిపాడు. ఈయన టిక్టాక్పై విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. యూజర్లను ప్రభావితం చేయడానికి, వాళ్లను నియంత్రించడానికి చైనా ప్రభుత్వం టిక్టాక్ను ఉపయోగించుకుంటుందని నెల క్రితంక్రిస్ ఆరోపించాడు.
ప్రభుత్వం కోరిక మేరకు ప్రైవేట్ కంపెనీలు యూజర్ల డేటాను అందజేయాలనే నియమం చైనాలో ఉంది. గల్వాన్ లోయ ఘటన తర్వాత చైనాకు చెందిన టిక్టాక్ యాప్ను భారత ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు చైనాకు సంబంధించిన 273 యాప్లపై కూడా నిషేధం ప్రకటించింది.