రియో, ఆగస్టు 30: బ్రెజిల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పేలుడు పదార్థాలు, రైఫిళ్లతో సౌ పౌలో రాష్ట్రంలోని అరకటుబా పట్టణంలోకి ప్రవేశించి, ప్రజలను భయభ్రాంతులను చేశారు. స్థానికులు కనిపించినవారిని కనిపించినట్టు బందీలను చేశారు. కొందరు పౌరులను కార్లకు కట్టేశారు. రెండు బ్యాంకులను దోచుకున్నారు. ఈ సమయంలో జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దోపిడీ దొంగలు పారిపోయేందుకు కొందరు బందీలను అడ్డుగా పెట్టుకున్నారు. వారిని తమ వాహనాలపై పడుకోబెట్టి కట్టేసి కొంతదూరం తీసుకెళ్లారు. అయితే దుండగులు ఎంతమొత్తంలో దోచుకున్నారో అధికారులు ఇంకా వెల్లడించలేదు.