Japan | ఆదివారం తెల్లవారుజామున టోక్యోతో సహా తూర్పు జపాన్లో సంభవించిన శక్తివంతమైన భూకంపం (Japan Earthquake )ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. టోక్యో ప్రాంతంతో సహా తూర్పు జపాన్లో 5.9 ప్రాథమిక తీవ్రతతో ఒక మోస్తరు భూకంపం సంభవించిందని, దీనివల్ల కనీసం 30 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. దక్షిణ బరాబకి ప్రిఫెక్చర్లో సముద్రమట్టం నుంచి 70 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం కారణంగా టోక్యో, నరిటా విమానాశ్రయం మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు, ఈశాన్య ప్రాంతాలకు సేవలు అందించే ఇతర స్థానిక సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
అయితే, షింకన్సెన్ బుల్లెట్ రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తున్నాయని ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ తెలిపింది. టోక్యోలోని కొన్ని ప్రాంతాలలో భూగర్భ నీటి పైపులు పగిలిపోయాయి. వందలాతి ఒండ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూకంప ప్రభావంతో పలు చోట్ల రోడ్లు, వంతెనలు, భవనాలు దెబ్బతిన్నాయని జపాన్ ప్రధాన మంత్రి సనాయి తకాయిచి ఎక్స్ వేదికగా తెలిపారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిందని ఆమె పేర్కొన్నారు.