ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం
అసెంబ్లీలో మాట్లాడిన ప్రతిపక్ష నేత షాబాజ్
సభ 12.30 నిమిషాలకు వాయిదా
సుప్రీం ఆదేశాల ప్రకారం ఇవాళ అవిశ్వాసంపై ఓటింగ్
అంతర్జాతీయ కుట్రపై చర్చిద్దాం: స్పీకర్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఇవాళ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కాసేపట్లో ఓటింగ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత షాబాజ్ మాట్లాడుతూ.. సుప్రీం ఆదేశాల ప్రకారం ఇవాళ సభను నడపాలన్నారు. రాజ్యాంగం, చట్టానికి అనుకూలంగా వ్యవహారించాలని ఆయన స్పీకర్ను కోరారు. ఆత్మసాక్షిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. స్పీకర్ అసద్ ఖైసర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్పై జరిగిన అంతర్జాతీయ కుట్ర గురించి కూడా చర్చించాలని అన్నారు. ఆ సమయంలో విపక్ష సభ్యలు నినాదాలు చేశారు. ఇవాళ్టి ఎజెండాలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నాలుగవ అంశంగా ఉంది. విపక్ష సభ్యులు పూర్తి సంఖ్యలో హాజరయ్యారు. ట్రెజరీ బెంచ్లు మాత్రం స్వల్ప సంఖ్యలో నిండి ఉన్నాయి. స్పీకర్ అసద్ సభను 12.30 నిమిషాల వరకు వాయిదా వేశారు.