Space VIP | లండన్, మార్చి 18: అంతరిక్షంలో విహరింపజేస్తామని, నక్షత్రాల నడుమ హాయిగా భోజనం చేయొచ్చని ఆఫర్ చేస్తున్నదో స్పేస్ టూరిజం కంపెనీ. అంతరిక్షంలో డిన్నర్ చేయించి జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతిని కల్పిస్తామని స్పేస్వీఐపీ అనే లగ్జరీ అంతరిక్ష టూరిజం సంస్థ చెప్తున్నది. నెప్ట్యూన్ అంతరిక్ష నౌకలో టూరిస్టులను భూ ఆవరణం ఆవలకు చేర్చి, డిన్నర్ చేయిస్తామని అంటున్నది.
2025 చివరి నాటికి లాంచ్ కానున్న ఈ మిషన్లో భాగంగా సముద్ర మట్టం నుంచి లక్ష అడుగులపైకి వెళ్లనున్నారు. మజిలీ చేరేందుకు 6 గంటల ప్రయాణం ఉంటుంది. అయితే, ఒక్కొక్కరి టికెట్ ధర కేవలం రూ.4.10 కోట్లు అని ఆ సంస్థ ప్రకటించింది.