మాస్కో: కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్గనీ ప్రిగోజిన్ మరణాన్ని రష్యా ఇన్విస్టిగేటివ్ కమిటీ నిర్ధారించింది. ప్రిగోజిన్(62) విమాన ప్రమాదంలోనే మృతి చెందినట్టు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. విమాన ప్రమాద స్థలం నుంచి 10 మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది.
మృతుల ఐడెంటిటీని నిర్ధారించామని, మరణించిన వారిలో ప్రిగోజిన్ కూడా ఉన్నట్టు కమిటీ ప్రతినిధి స్వెట్లనా పెట్రెంకో వెల్లడించారు. అయితే విమానం కూలిపోవడానికి గల కారణాలను ఆయన చెప్పలేదు.