లండన్: పసిఫిక్ సముద్రం మధ్య, తూర్పు ప్రాంత ఉపరితలంలో అధిక ఉష్ణోగ్రతలకు కారణమయ్యే ఎల్నినో ప్రభావం రాబోయే నెలల్లో పెరగనున్నదని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎమ్వో) వెల్లడించింది. మూడు సంవత్సరాలు నిరంతరాయంగా కలిగిన అసాధారణ లానినా ప్రభావం తర్వాత ఎల్నినో ప్రభావం పెరగవచ్చని తెలిపింది. ఈ ప్రభావం మార్చి-మే మధ్య 90 శాతం సంభవించవచ్చని పేర్కొంది. ఎల్నినో, లానినా ప్రభావాలు సహజంగా సంభవిస్తాయని, వీటి ప్రభావం సీజనల్గా కురిసే వర్షపాతాలపై పడి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతున్నాయని డబ్ల్యూఎమ్వో తెలిపింది.