Taliban on India Budget | భారత్ బడ్జెట్ను ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లు స్వాగతించారు. ఆఫ్ఘనిస్థాన్కు సాయం అందిస్తామని బడ్జెట్లో చేసిన ప్రకటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని వారు చెప్పినట్లు ఆ దేశ మీడియా సంస్థ `ఖమ్మ` పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి సహాయ ప్యాకేజీ కింద 2023-24 ఆర్థిక బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.200 కోట్ల (25 మిలియన్ డాలర్లు) నిధిని కేటాయిస్తామని ప్రకటించారు. తాలిబన్ల ఆధీనంలోకి ఆఫ్ఘనిస్థాన్ వెళ్లిపోయిన తర్వాత ఆ దేశానికి భారత్ వరుసగా రెండో ఏడాది సహాయ ప్యాకేజీనిస్తున్నట్లు తెలిపారు.
భారత్ బడ్జెట్ను స్వాగతిస్తున్నట్లు తాలిబన్ సంప్రదింపుల కమిటీ మాజీ సభ్యుడు సుహైల్ షాహిన్ తెలిపారు. `ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధికి భారత్ అందజేస్తున్న మద్దతును అభినందిస్తున్నాం. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, నమ్మకం, విశ్వాసాన్ని బలోపేతం చేస్తాయి` అని సుహైల్ షాహిన్ చెప్పినట్లు `ఖమ్మ` తెలిపింది.
2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత.. ఆఫ్ఘన్-భారత్ మధ్య సంబంధాలు దెబ్బ తింటాయని, భారత్ మద్దతుతో చేపట్టిన ప్రాజెక్టులు నిలిచిపోతాయని భావించారు. `ఆఫ్ఘనిస్థాన్లో పలు ప్రాజెక్టుల్లో భారత్ పెట్టుబడులు పెట్టింది. ఈ ప్రాజెక్టుల పనులు భారత్ ప్రారంభిస్తే, రెండు దేశాల మధ్య సంబంధాల వృద్ధికి దోహద పడుతుంది. అపనమ్మకాలు తొలగిపోతాయి` అని సుహైల్ షాహిన్ అన్నట్లు సమాచారం.