కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోకి ఆదివారం ప్రవేశించిన తాలిబన్లు క్రమంగా అన్ని అధికార కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా కాబూల్లో భారత్ నిర్మించిన ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని సాయుధ తాలిబన్లు సోమవారం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్పీకర్ చైర్లో ఒక తాలిబన్ కూర్చొని టేబుల్పై తుపాకీని ఉంచాడు. అధ్యక్షుడితోపాటు ఇతర ప్రముఖులు ఆశీనులయ్యే స్థానాల్లో మరి కొందరు సాయుధ తాలిబన్లు కూర్చున్నారు. పార్లమెంట్ లోపల ఉన్న ఆఫ్ఘనిస్థాన్ జాతీయ జెండాను తొలగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు గతంలో మాదిరిగా ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ను పునరుద్ధరించడంతోపాటు బహిరంగ ఇస్లామిక్ ప్రభుత్వాన్ని తాలిబన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది.