కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లతో స్థానిక రెబల్స్ ప్రతిఘటన కొనసాగుతున్నది. తాజాగా సోమవారం అందరాబ్ ప్రాంతంలో తాలిబన్, ప్రతిఘటన ఫైటర్ల మధ్య పలుచోట్ల దాడులు జరిగాయి. తాలిబన్ బాను జిల్లా చీఫ్తోపాటు 50 మంది తాలిబన్ ఫైటర్లను రెబల్ ఫోర్స్ మట్టుబెట్టినట్లు తెలుస్తున్నది. మరో 20 మంది తాలిబన్ ఫైటర్లను ప్రతిఘటన ఫోర్స్ బంధీ చేసినట్లు స్థానిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడిలో ఒక రెబల్ ఫైటర్ మరణించగా ఆరుగురు గాయపడినట్లు వెల్లడించాయి.
మరోవైపు తాలిబన్ ఫైటర్లు పంజ్షీర్ ప్రావిన్స్ను చుట్టుముట్టారు. అయితే చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి వారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, స్థానిక రెబల్స్ స్వాధీనం చేసుకున్న మూడు జిల్లాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది.