కాబూల్: ఆఫ్ఘనిస్థాన్పై తాలిబన్ల పట్టు అంతకంతకే బిగుస్తున్నది. గత మే నెలలో ఆఫ్ఘన్ నుంచి తుది విడుత విదేశీ బలగాల ఉపసంహరణ మొదలైనప్పటి నుంచి తాలిబన్లు ( Talibans ) చాపకింద నీరులా తమ కార్యకలాపాలను ఉధృతం చేయడం మొదలుపెట్టారు. క్రమంగా పట్టుబిగుస్తూ ఇప్పుడు ఏకంగా నగరాలనే తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఇటీవలే జరాంజ్ రాష్ట్ర రాజధాని నిమ్రోజ్ సిటీని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. తాజాగా జౌజ్జాన్ రాష్ట్ర రాజధాని షెబెర్ఘాన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
దాంతో కేవలం 24 గంటల వ్యవధిలోనే తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లోని రెండు కీలక రాష్ట్రాల రాజధానులను స్వాధీనం చేసుకున్నట్లయ్యింది. షెబెర్ఘాన్పై తాలిబన్లు పట్టుబిగియడంతో అక్కడి బలగాలు, అధికారులు అంతా నగరం విడిచి పారిపోయారు. తాలిబన్ నాయకుడు అయిన అబ్దుల్ రషీద్ దోస్తుమ్కు షెబెర్ఘాన్ స్వస్థలం. టర్కీలో మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకుని వారం క్రితమే దోస్తుమ్ ఇక్కడికి వచ్చాడు. పక్కా స్కెచ్ వేసి నగరాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్నారు.