తైపీ, సెప్టెంబర్ 18: తైవాన్ ఆగ్నేయ తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భారీ భూకంపంతో పలు భవనాలు కుప్పకూలాయి. రైల్వే ప్లాట్ఫామ్పై ఉన్న ఒక రైలు ఆట బొమ్మలా కదిలింది. రోడ్లు, వంతెనలు, రైలు పట్టాలు ధ్వంసమయ్యాయి. గత 24 గంటల్లో 12 సార్లు భూమి కంపించిందని అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో వందల మంది సైనికులు పాల్గొన్నట్టు వెల్లడించారు. కాగా, ఆదివారం రాత్రి వరకు అందిన సమాచారం మేరకు ఎలాంటి ప్రాణనష్టం కలగలేదు.