కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దారుణం చోటుచేసుకుంది. షాపిం గ్ మాల్లోకి దూసుకొచ్చిన ఓ దుం డగుడు అక్కడివారిపై విచక్షణారహితంగా కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు న్యూ సౌత్వెల్స్ పో లీస్ అధికార ప్రతినిధి తెలిపారు.
శనివారం మధ్యాహ్నం నగరంలోని బోండీ జంక్షన్ వెస్ట్ఫీల్డ్ మాల్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి పాల్పడ్డ దుండగుడు ఎవరు? అన్నది ఇప్పుడే చెప్పలేమని పోలీసు లు అన్నారు. మొత్తం 8 మందికి గా యాలయ్యాయని, నిందితుడిని ఘ టనా స్థలంలోనే హతమార్చారు.