కొలంబో: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ సాబ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో సేల్స్ ట్యాక్స్ను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనేందుకు మరో మార్గం లేదని ఆయన తెలిపారు. 2019లో వ్యాట్ పన్నును 8 శాతానికి తగ్గించి ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. నిత్యావసరాలు దిగుమతి చేసుకుంటున్న శ్రీలంకకు రాబోయే 8 నెలల్లో 4 బిలియన్ల డాలర్లు అవసరం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓ అంతర్జాతీయ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలను త్రీవంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఐఎంఎఫ్, ఇండియా, చైనా దేశాలతో బెయిల్ అవుట్ ప్యాకేజీ గురించి చర్చలు జరుపుతున్న సాబ్రీ తెలిపారు. అయితే ప్రస్తుతం గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే కచ్చితంగా వ్యాట్ పెంచాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.