వాషింగ్టన్, సెప్టెంబర్ 24: భూమి పుట్టుక, జీవం గురించిన గుట్టు విప్పడంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ముందడుగు వేసింది. నాసాకు చెందిన ఒసిరిస్ రెక్స్ స్పేస్క్రాఫ్ట్ క్యాప్సూల్ ‘బెన్నూ’ అనే గ్రహశకలం నమూనాలను భూమిపైకి తీసుకొచ్చింది.
భూమినుంచి లక్ష కిలోమీటర్ల దూరం నుంచి విడుదలైన ఈ క్యాప్సూల్ ఉటాహ్ ఎడారిలో దిగింది. ఒసిరిస్ రెక్స్ స్పేస్క్రాఫ్ట్ను నాసా 2016లో ప్రయోగించింది. రెండేండ్ల తర్వాత బెన్నూ గ్రహశకలాన్ని చేరుకొన్న ఈ వాహకనౌక అక్కడ దుమ్ము, రాళ్లను సేకరించింది. ఈ నమూనాలను క్యాప్యూ ల్ ద్వారా భూమికి చేరవేసింది.