సియోల్ : కరోనా టీకా మొదటి డోసు తీసుకున్న వారెవ్వరూ బయటకు వెళ్లినప్పుడు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని దక్షిణ కొరియా ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. సెప్టెంబర్ నాటికి 52 మిలియన్ల మందిలో 70 శాతం మంది వృద్ధులకు కరోనా టీకా వేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపింది. ఈ క్రమంలోనే మొదటి డోసు తీసుకున్న వారు బయటి ప్రదేశాల్లో మాస్కు ధరించాల్సిన అవసరం లేదనే ప్రతిపాదన వృద్ధులకు టీకా వేసేందుకు ప్రోత్సహకంగా ఉంటుందని పేర్కొంది.
మొదటి డోసు తీసుకున్న ప్రజలను జూన్ నుంచి బయటకు అనుమతించాలని, వారిపై ఎలాంటి ఆంక్షలు విధించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. 70 శాతం మంది ప్రజలు కరోనా తీసుకున్న తర్వాత క్వారంటైన్ నిబంధనలు కూడా సడలించే అవకాశం ఉందని తెలిపింది. 60 నుంచి 74 ఏండ్ల వయసున్న వారు టీకా వేయించుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోగ్య శాఖ మంత్రి కోన్ డియోక్ తెలిపారు. 65 నుంచి 74 ఏండ్ల వయసున్న వారికి 1200 క్లినిక్స్లో కొవిడ్ టీకాను గురువారం నుంచి ప్రారంభించనుంది. ఇప్పటి వరకు దక్షిణ కొరియాలో 1,37,682 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,940 మంది చనిపోయారు.