కాబూల్ : పశ్చిమ కాబూల్లోని పాఠశాలల వద్ద పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. డజన్ల కొద్దీ జనం గాయపడ్డారని మంగళవారం స్పుత్నిక్ తెలిపింది. పశ్చిమ కాబూల్లోని ముంతాజ్ పాఠశాల భూభాగంలో మొదటి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పలువురు గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. రాజధానిలోని దష్త్-ఎ-బర్చి జిల్లాలోని మరో పాఠశాల సమీపంలో రెండో పేలుడు సంభవించింది. ఇక్కడ ఆరుగురు మరణించారని, డజన్ల కొద్దీ జనం గాయపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.