న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17 : పెరుగుతున్న స్మార్ట్ఫోన్ల వాడకం, రీల్స్కు దక్కుతున్న ప్రజాదరణ నేపథ్యంలో ప్రజలను మళ్లీ పుస్తకాల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో సింగపూర్ ప్రభుత్వం ఐదేండ్ల జాతీయ పఠన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద రోజుకు కనీసం 15 నిమిషాల పాటు చదివే వారికి బహుమతులు అందచేస్తారు.
ప్రభుత్వానికి చెందిన క్రౌడ్ టాస్క్ ఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆట తరహా బహుమతి విధానాన్ని నేషనల్ లైబ్రరీ బోర్డ్(ఎన్ఎల్బీ) ప్రవేశపెట్టింది. ఇందులో పాల్గొనేవారు రోజుకు ఒకసారి తమ పఠన సమయాన్ని నమోదు చేసుకోవచ్చు. తాము చదివిన దానికి అనుగుణంగా వర్చువల్ కాయిన్లను పొందవచ్చు. ఈ పథకం కింద రోజుకు కనీసం 15 నిమిషాల పాటు చదివిన వారికి 20 వర్చువల్ కాయిన్స్ లభిస్తాయి. వీటిని నగదు బహుమతికి మార్చుకోవచ్చు.