టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై ఇవాళ కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అబే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ప్రధాని ఫుమియో కిషిదా తెలిపారు. అబే ప్రాణాలతో బ్రతికి రావాలని తాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కాల్పుల ఘటనను ప్రధాని కిషిదా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రులందరూ టోక్యో చేరుకోవాలని ఆదేశించారు. అయితే ఎన్నికల షెడ్యూల్ను మారుస్తారా లేదో తెలియదు. షింజోపై అటాక్ క్షమించరానిదని తెలిపారు. అబే ప్రాణాలను దక్కించుకునేందుకు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడి ఘటన హేయమైందని, ఏమాత్రం సహించబోమన్నారు. ఎన్నికలు జరగబోయే వేళ ఈ దాడి జరిగిందని,ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని ఆయన అన్నారు.