Kartarpur Corridor | లాహోర్, అక్టోబర్ 24: భారత్-పాకిస్థాన్ విభజన సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్లలో విడిపోయిన అక్కా తమ్ముళ్లు 76 ఏండ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్న ఉద్వేగపూరిత దృశ్యం కర్తార్పూర్లో చోటుచేసుకుంది. పాకిస్థాన్లో ఉంటున్న మహమ్మద్ ఇస్మాయిల్, భారత్లో ఉంటున్న అతని కజిన్ సురీందర్ కౌర్లు తమ బంధువులతో కలిసి గురుద్వార దర్బార్ సాహిబ్ ఉన్న కర్తార్పూర్ వచ్చి ఒకరినొకరు కలుసుకుని ఆలింగనం చేసుకున్నారు.
కొన్ని దశాబ్దాల పాటు దూరంగా ఉన్న వీరిని సామాజిక మాధ్యమం కలిపిందని పాకిస్థాన్ అధికారులు తెలిపారు. స్వాతంత్య్రానికి ముందు ఇస్మాయిల్, కౌర్ కుటుంబాలు భారత్లోని జలంధర్ జిల్లాలోని షాకత్లో ఉండేవి. అయితే పాకిస్థాన్ విభజన తర్వాత అల్లర్లు చెలరేగడంతో కౌర్ కుటుంబం భారత్లోనే ఉండగా, ఇస్మాయిల్ కుటుంబం పాకిస్థాన్కు వలస పోయింది. ఇటీవల ఇస్మాయిల్ గురించి ఒక పాకిస్థాన్ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసింది. దానిని చూసి ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి కౌర్ కుటుంబం గురించి తెలియజేశారు. దీంతో ఇరు దేశాలకు చెందిన వీరు కర్తార్ వేదికగా 76 ఏండ్ల తర్వాత కలుసుకున్నారు.