మాస్కో: సోవియేట్ నేత మైఖేల్ గోర్భచోవ్కు ఇవాళ అంతిమ వీడ్కలు పలుకుతున్నారు. భారీ సంఖ్యలో రష్యా ప్రజలు ఆ నేటి మహానేతకు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. మాస్కోలోని హౌజ్ ఆఫ్ ద యూనియన్స్లో గోర్భచోవ్ పార్ధీవదేహానికి ఫేర్వెల్ సెర్మనీ నిర్వహించారు. ఆగస్టు 30వ తేదీన 91 ఏళ్ల గోర్బచోవ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. 1985లో సోవియేట్ యూనియన్లో కమ్యూనిస్టు పార్టీకి జనరల్ సెక్రటరీ అయ్యారు. 1990 నుంచి 91 వరకు సోవియేట్ యూనియన్కు అధ్యక్షుడిగా చేసిన తొలి వ్యక్తి ఆయనే.
హౌజ్ ఆఫ్ యూనియన్స్లో ప్రస్తుతం విషాద వాతావరణం నెలకొన్నది. తమ ప్రియతమ నేతకు నివాళి అర్పించేందుకు జనం భారీగా వస్తున్నారు. ఓపెన్ శవపేటిక గోర్భచోవ్ పార్ధీవ దేహాన్ని ఉంచారు. కడచూపు కోసం వస్తున్న వారు పుష్ప నివాళి అర్పిస్తున్నారు. గతంలో సోవియేట్ నేతలు లెనిన్, స్టాలిన్, బ్రెజ్నేవ్లకు కూడా ఇక్కడే నివాళి అర్పించారు. అయితే ప్రస్తుతం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఈ ఫేర్వెల్ సెర్మనీకి హాజరుకాలేదు. పుతిన్ షెడ్యూల్ ఖాళీగా లేదని క్రిమ్లిన్ తెలిపింది. మాస్కోలోని ఓ క్రైస్తవ శ్మశానవాటికలో గోర్భచోవ్ను ఖననం చేయనున్నారు.